Sunday Funday | సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): సాయం కాలం… సంధ్యా సమయం.. నగరం నడిబొడ్డున్న హుస్సేన్సాగర్ తీరం.. అందాలతో కనువిందు చేస్తుంది. అలాంటి సాగర తీరంలోని ట్యాంక్బండ్పై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సన్డే ఫన్డే జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా పోస్టు చేస్తున్నారు.
సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసే వారికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదుగా ట్రాఫిక్ లేకుండా పోలీసులు చర్యలు తీసుకునే వారు. దీంతో నగర వాసులంతా సన్డే ఫన్డే అంటూ సాయంత్రం నుంచి రాత్రి ఎంతో సరదాగా గడిపేవారని, అలాంటి రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నామని పలువురు పేర్కొన్నారు.