గ్రేటర్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ పోటీల్లో నువ్వానేనా అన్నట్లు క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంలో జరిగిన క్రీడా సంబురాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కప్ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం
వేదికగా కొనసాగుతున్న పోటీలకు 618 మండలాల నుంచి 3,334 మంది క్రీడాకారులు
తరలివచ్చారు. వివిధ క్రీడాంశాల్లో పాల్గొని సత్తా చాటగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, స్పోర్ట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, ఎండీ లక్ష్మి, పాల్గొని క్రీడాకారులను సత్కరించారు. మరోవైపు సోమవారం సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల సంగీత హోరులో క్రీడాకారులు తడిసి ముద్దయ్యారు.