సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): సిటీ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నగరవ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 440 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో ద్విచక్రవాహనదారులు 376 మంది, ఆటోరిక్షాలు 21 మంది, కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు 43 మంది ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్లో 315, మల్కాజిగిరిలో 174 కేసులు నమోదైనట్లు చెప్పారు.