మేడ్చల్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పోరుబాటతో నిషేధిత జాబితా(22ఏ) నుంచి ప్రజల ఆస్తుల తొలగింపులో రెవెన్యూశాఖ నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 22ఏ బాధితులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తమగోడును వెల్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు బాధితులతో బాధితులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆందోళన చెందవద్దని మీ వేంట మేము ఉన్నమంటూ భరోసా కల్పించారు. హరీశ్రావుకు తోడు జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇస్తున్న భరోసా బాధితులకు కొండంత బలంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పోరుబాటతో కాంగ్రెస్ ప్రభుత్వంపై త్రీవంగా ఒత్తిడి పెరగడంతో.. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయానికి వివరాలను పంపుతున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ ఒత్తిడి మేరకు నిషేదిత జాబితాను కొన్నింటిని తొలగించేందుకు రెవెన్యూశాఖ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలలో మాత్రం జాప్యం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూశాఖ నిషేధిత జాబితా నుంచి తొలగింపునకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయగా.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలో ఆన్లైన్లో కనిపించాలంటే 3 రోజుల సమయం పడుతుందని సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఉద్యోగులు చేబుతున్నారు. ఈక్రమంలో తమ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించారా లేదా అన్న అనుమానాలు బాధితులకు కలుగుతున్నాయి.
ప్రజల ఆస్తులను పూర్తిగా నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు బీఆర్ఎస్ పోరుబాట కొనసాగిస్తుంది. ప్రజలు కష్టపడి సంపాందించుకున్న ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం ఏంటి. బాధితులు ధైర్యం కొల్పోవద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల తొలగించేవరకు ఊరుకునేది లేదు. బాధితులు నన్ను ఎప్పుడైనా కలువవచ్చు. వారి వివరాలు ఇస్తే జిల్లా కలెక్టరేట్ కార్యాలయనికి పంపించి నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటాం.
– కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్
జిల్లాలోని మెజార్టీ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో ఆస్తుల క్రయ, విక్రయాలు జరుగక అత్యవసరం డబ్బులు అవసరం ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిషేదిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించేవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం. ప్రజలెవరూ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మవద్దు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లీగల్ సెల్కు ఫిర్యాదు చేయాలి.
– మర్రి రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజిగిరి