చాదర్ఘాట్, మార్చి 12 : మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని మూసానగర్ వద్ద మూసీ కాలువలో స్థానికులకు కనిపించాడు. వెంటనే స్థానికులు బాలుడిని బయటకు తీసుకొచ్చి స్నానం చేయించి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు.
అదే సమయంలో జోహెబ్ ఆచూకీ కోసం ఫిర్యాదు చేసేందుకు చాదర్ఘాట్ పోలీస్స్టేషన్కు వచ్చిన బాలుడి తాత ఎం.ఏ.జబ్బార్కు బాలుడిని అప్పగించారు. సరైన సమయంలో స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి జోహెబ్ను మూసీ నది ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడిన స్థానికులకు పలువురు అభినందించారు.