సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ):జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగనున్న ఐదవ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీకి సంబంధించిన దాదాపు 23 తీర్మానాలను ఆమోదించనున్నారు. ముఖ్యంగా 2023-24కు రూ.6,224 కోట్ల బడ్జెట్ను ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలు, ప్రజల సమస్యలపై చర్చ జరిపేందుకుగానూ పార్టీల వారీగా అవకాశం ఇచ్చారు. దాదాపు 30 ప్రశ్నలపై చర్చించే అవకాశం ఉన్నది. అయితే తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.