చిక్కడపల్లి :కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం, చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో అ్యతిధిక జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణం అని మండిపడ్డారు. బీసీలను గుర్తించని పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో వడ్డెరులకు మంచి రోజులు రానున్నాయని అన్నారు. రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. శివరాత్రి ఐలుమల్లు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వడ్డెర బిడ్డ ఆలకుంట్ల ఎల్లయ్య పోటీ చేస్తున్నారని వివరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షునిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆలకుంట్ల ఎల్లయ్యను నియమించినందుకు కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, సంఘం మహిళ విభాగం అధ్యక్షురాలు శివరాత్రి ఉమ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తురి గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంటిపురి శ్రీనివాస్, వరికుప్పల శ్రీశైలం, చెన్నయ్య, వెంకటేష్, వరికుప్పల వెంకటేష్, కార్యదర్శి వెంకన్న,వేముల శ్రీనివాస్, వెంకన్న, మహిళా ప్రధాన కార్యదర్శి వల్లెపు పద్మ, గుంజమారి మణమ్మ తదితరుల పాల్గొన్నారు.