HomeHyderabadThe Aim Is To Provide Drinking Water To Every Household
ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యం
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం తమ లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
వనస్థలిపురం, జనవరి 4 : నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం తమ లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం జలమండలి జనరల్ మేనేజర్లు బలరాం రాజు, వినోద్, అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివారు కాలనీలకు నూతనంగా పైపులైన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక్క ఇల్లు ఉన్నా నీరందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. గతంలో జలమండలి జీఎం దానకిశోర్తో కాలనీ సంక్షేమ సంఘాల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. దాంతో నూతన లైన్లు మంజూరైనట్లు తెలిపారు. అధికారులు పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వేసవి వచ్చే నాటికి నీరు అందించాలన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ఖాద్రీ కాలనీవాసులు
హస్తినాపురం డివిజన్ ఖాద్రీ కాలనీకి ఇటీవల పూర్తి స్థాయిలో తాగునీరు అందించడం జరిగింది. బుధవారం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డితో కలిసి కాలనీవాసులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిశారు. తమకు పూర్తిస్థాయిలో నీరిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.