మన్సూరాబాద్, ఏప్రిల్ 24: కాలనీల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి వీరన్నగుట్టకాలనీలో రూ.67 లక్షలతో చేపట్టిన అంతర్గత డ్రైనేజీ పైపులైన్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు నివసించే శివారు కాలనీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. కాలనీలో నెలకొన్న విద్యుత్ స్తంభాల సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని.. ఇరవై స్తంభాలు మంజూరు అయ్యాయని తెలిపారు. వీరన్నగుట్ట కాలనీలో ఇప్పటికే బస్తీ దవాఖానను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.67 లక్షలతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ ఏర్పాటు పనులు పూర్తికాగానే కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్యాదవ్, కొసనం వెంకట్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి, కాలనీ అధ్యక్షుడు కేకేఎల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దేవ, కోశాధికారి రాజు, సభ్యులు సంతోష్చారి, సత్తయ్య, జిలాని, బాలరాజు, శ్రీను, నాగేశ్వర్ రావు, మహేందర్, నాయకులు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, కడారి యాదగిరి యాదవ్, పారంద నర్సింగ్రావు, పాతూరి శ్రీధర్గౌడ్, యంజాల జగన్ తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను త్వరితగతిన తొలగించి ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ చెరువులో గత ఐదు రోజులుగా చేపట్టిన గుర్రపుడెక్క తొలగింపు పనులను శనివారం ఎంటమాలజీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుమారు 50 మంది సిబ్బందితో గుర్రపుడెక్క తొలగింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలిపారు. చెరువులోని మురుగునీటి ద్వారా లార్వా వృద్ధి చెందకుండా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలని ఎంటమాలజీ అధికారులకు సూచించారు. నాగోల్ చెరువుపై త్వరలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పరిసర కాలనీల ప్రజలకు మార్నింగ్ వాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ అధికారులు రజిని, రవీందర్ రెడ్డి, నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్, అనంతుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రానున్న వర్షాకాలం లోపు కాప్రాయి చెరువు ఔట్లెట్ను పూర్తి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి చెరువు పరిసరాల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వర్షాకాలంలో తలెత్తిన సమస్యను దృష్టిలో ఉంచుకుని ఔట్లెట్ను నిర్మిస్తున్నామన్నారు. ఇంజాపూర్ సమీపంలో అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. అనుమతులు వస్తే ట్రంక్లైన్ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఎంత పెద్ద వర్షం వచ్చినా ముంపు సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ఈ సందర్భంగా హరిహరపురం కాలనీవాసులు ఎమ్మెల్యేకు పలు సమస్యలు వివరించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, అనిల్ చౌదరి, కొత్త శ్రీధర్గౌడ్, కాజా శ్రీనివాస్, రాఘవేందర్రావు, న్యూటన్, రాంబాబు, సుజిత్రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.