హైదరాబాద్: ఐటీ పరిశ్రమలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రత్యేకతను కలిగి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రశంసించారు. ఇవాళ టీహబ్ వేదికలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందీప్ మఖ్తల చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ టీటా ఐటీ ఉద్యోగులకు అండగా ఉండటమే కాకుండా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రత్యేకత చాటుకుందని ప్రశంసించారు.
కంప్యూటర్, అక్ష రాస్యత, టీవ్యాలెట్, టీ ఫైబర్, ఇయర్ ఆఫ్ ఏఇ సహా అనేక కార్యక్రమాల్లో టీటా బృందం క్రియాశీలంగా పాల్గొందని అన్నారు. టీటా చేపట్టిన వివిధ కార్యక్రమాలకు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ సంస్థ అవార్డును తెలంగాణ ప్రభుత్వం అందజేయడం టీటాను సందీప్ మఖ్తల నడిపించిన తీరుకు నిదర్శ నమని ప్రశంసించారు. 2023-26 వరకు సందీప్ కుమార్ మఖ్తల ప్రెసిడెంట్గా పనిచేయ నున్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందీప్ కుమార్ మఖ్తలను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు.
మరోవైపు బతుకమ్మ సంబురాల్లో భాగంగా, టీహబ్ వేదికగా అట్టహాసంగా పూల పండుగను టీటా నిర్వహించిం ది. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, గాయకుడు సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.