సిటీబ్యూరో: బుద్వేల్లో హెచ్ఎండీఏ చేపట్టిన లే అవుట్ అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచారు. సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని లే అవుట్ చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ లే అవుట్ అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.
సుమారు రూ. 354 కోట్ల వ్యయంతో లే అవుట్లో విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న మరో లే అవుట్లోనూ మౌలిక వసతుల కల్పన కోసం రూ. 47 కోట్లను వెచ్చించనున్నారు.