అబిడ్స్, జనవరి 2: గ్రాండ్ హోటల్లో కస్టమర్స్పై దాడి చేసిన కేసులో పది మందిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ నరసింహరాజు కథనం ప్రకారం… డిసెంబర్ 31న ధూల్పేట గంగాబౌలి ప్రాంతానికి చెందిన సుమిత్సింగ్ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో అబిడ్స్లోని గ్రాండ్ హోటల్కు వచ్చారు.. బిర్యాని సరిగా ఉడకలేదనే విషయంలో వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వెయిటర్లు కస్టమర్లపై దాడి చేసిన విషయంలో అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించి వెయిటర్లు, ఫ్లోర్ క్లీనర్లు మొత్తం పది మందిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో హోటల్ యజమాని ప్రమేయంపై వివరాలను సేకరిస్తున్నామని, సాక్ష్యాలను సేకరించి అతడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని ఇన్స్పెక్టర్ టి.నరసింహ రాజు తెలిపారు. కేసులో నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయడంతో.. పోలీస్ ఉన్నతాధికారులు అబిడ్స్ ఇన్స్పెక్టర్తో పాటు సిబ్బందిని అభినందించారు.