మేడ్చల్ జోన్ బృందం : వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. తెల్లవారుజుమునుంచే స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
పలు ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కీసర, చీర్యాల్లోనిఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్ దంపతులు చీర్యాల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు.