సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2 డిగ్రీలు, గాలిలో తేమ 42శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.