సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 35శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ఇదే తొలిసారి.