సిటీబ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4డిగ్రీలు, గాలిలో తేమ 54శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.