హైదరాబాద్: దేశవ్యాప్తంగా 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని నమస్తే తెలంగాణ ప్రధాన కార్యాలయంలోనూ ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, బ్యూరో ఇంచార్జీ శ్రీనివాస్తో పాటు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.