మేడ్చల్, మార్చి 2: కేంద్రంలోని బీజేపీ పాలన తీరుపై జనాగ్రహం పెల్లుబికింది. పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ ధరలు రోజురోజుకు పెంచడంపై గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. సామాన్యుడి బతుకు భారంగా మారిందని, గ్యాస్తో పాటు నిత్యావసరాల ధరలను అడ్డగోలుగా పెంచతూ ప్రధాని మోడీ పేదల నడ్డి విరుస్తున్నారని పలువురు మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడు తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ కార్పొరేటర్ కంపెనీలకు దోచిపెడుతుందని ధ్వజమెత్తారు.గ్యాస్ ధర ఒకేసారి రూ.50 పెంచడం దారుణమన్నారు.కార్మికులుగా, కూలీనాలీచేసుకుంటూ రూ.10వేల నుంచి రూ.12వేలు సంపాదించే వారు ఎంతో మం ది ఉన్నారన్నారు. వారు గ్యాస్కు రూ.1200 చెల్లించడం సాధ్యం కాని పని అన్నారు. వాణిజ్య సిలిండర్ ధరను కూడా రూ.355 పెంచిందన్నారు.
ఇది చిరు వ్యాపారులకు ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. బీజేపీ తీరుచూస్తే మళ్లీ కట్టెల పొయ్యి దిక్కయ్యేలా చేస్తుందన్నారు.బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలోకి వస్తారన్నారు. మేడ్చల్లో 44వ జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికానర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, రామస్వా మి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పీఏసీఎస్ చైర్మన్లు సురేశ్ రెడ్డి, రణదీప్ రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి, జగన్ రెడ్డి,నాగరాజు, శైలజాహరినాథ్, మహిళలు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్: నాగారం మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపారు. దమ్మాయిగూడలో కట్టెలపొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్లు మల్లేశ్ యాదవ్, నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి రెడ్డి, నాయకులు,కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
బోడుప్పల్: బోడుప్పల్లో కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ మహిళలు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపి, మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బోడుప్పల్ డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, రవిగౌడ్, రాంచంద్రారెడ్డి, రమేశ్, విశ్వనాథ్, బొమ్మక్బాలయ్య, కీర్తన్రెడ్డి, మనోహర్రెడ్డి, శత్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ: పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి, రహదారిపై ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.
జవహర్నగర్: జవహర్నగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్ ఏకే మురుగేశ్, లావణ్య, కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, శేత, నాయకులు పాల్గొన్నారు.