దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయాల్సిందేనని, లేదంటే బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని పలు దళిత సంఘాలు హెచ్చరించాయి. బుధవారం నగర వ్యాప్తంగా బీజేపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానంపై బీజేపీ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పలు దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ దళిత విభాగం నాయకులు తరలివెళ్లారు. పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని వారు డిమాండ్ చేశారు. వీరికి మైనార్టీలు, ఇతర కుల సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.
బన్సీలాల్పేట్ డివిజన్ పరిధి జబ్బార్ కాంప్లెక్స్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశాల మేరకు నిరసన చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ హేమలత, నాయకులు లక్ష్మీపతి, వెంకటేశంరాజు, ప్రేమ్కుమార్, వెంకటరమణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
– బేగంపేట్, సెప్టెంబర్ 14
తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మాణంపై బీజేపీ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పలు దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ దళిత విభాగాల నాయకులు తరలివెళ్లారు. పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ ఈ విషయాన్ని గురించి పార్లమెంట్లో ప్రస్తావించాలని వారు డిమాండ్ చేశారు.
-బంజారాహిల్స్,సెప్టెంబర్ 14
దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా బుధవారం బోరబండలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దళితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మోతీనగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బోరబండ బస్టాండ్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో దళిత సంఘాలకు మద్దతుగా మైనార్టీలు, ఇతర కుల సంఘాలు పాల్గొని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
– ఎర్రగడ్డ, సెప్టెంబర్ 14