శంషాబాద్ రూరల్, జనవరి 30 : శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో మై హోం గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 4.5 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంతో నేరాలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయన్నారు. కిందిస్థాయి అధికారి నుంచి డీజీపీ వరకు సమన్వయంతో పని చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే మంచిపేరు తీసుకొచ్చారని అభినందించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, చినజీయర్స్వామి, మై హోం గ్రూప్ సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, జూపల్లి జగపతిరావు, ‘నమస్తే తెలంగాణ’ ఎండీ దామోదర్రావు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ భాస్కర్గౌడ్, శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.