వీధివీధినా.. గులాబీ పండుగ
జెండా ఆవిష్కరించి, కేక్ కట్చేసి సంబురాలు
హోరెత్తిన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు
రాష్ట్ర పథకాలే దేశానికి ఆదర్శం
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు కేక్ కట్చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నాడు ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకు వెళ్లి స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్, ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి రాష్ర్టాన్ని దేశానికి రోల్ మోడల్గా మార్చారని తెలిపారు.
మన రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పథకాన్ని కేంద్రం కాపీ కొడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నదని, ప్రస్తుతం తెలంగాణ చెబితే.. దేశం వినే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. విపక్షాలు అభివృద్ధిలో పోటీ పడలేక, రాష్ర్టానికి ఏం చేశారో చెప్పలేక, నిధులు తీసుకురాలేక, ప్రజల మధ్య మత విద్వేశాలు సృష్టిస్తూ.. రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు ఉద్యమ సింహాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
కోలాహలంగా హెచ్ఐసీసీ సభా వేదిక
సిటీబ్యూరో/ మియాపూర్/ మాదాపూర్, ఏప్రిల్ 27 : శేరిలింగంపల్లి నియోజకవర్గం హెచ్ఐసీసీలో బుధవారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. హెచ్ఐసీసీ పరిసరాలన్ని గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు హాజరు కావటంతో వేడుక యావత్తు క్రమశిక్షణతో కొనసాగింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో హెచ్ఐసీసీ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఐటీ దారులన్ని గులాబీ జెండాలతో కొత్త రూపును సంతరించుకున్నాయి.
చల్లని వాతావరణం.. చక్కని అనుభూతి