నగరంలో సామాన్యులు వివాహాలు, ఇతర వేడుకలు చేసుకోవాలంటే.. అంత సులువుకాదు.. ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఎంత కాదన్నా.. తక్కువలో తక్కువగా ప్రైవేటు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలంటే.. రూ. 60వేల నుంచి లక్ష దాటుతుంది. వంట సామగ్రి, డెకరేషన్ తదితర ఖర్చులు కలుపుకొంటే..వామ్మో అనాల్సిందే. పేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలు తెలిసిన తెలంగాణ సర్కారు.. సకల సౌకర్యాలతో చక్కటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇందులోభాగంగానే గ్రేటర్లో రూ. 90 కోట్లతో 31 చోట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది బల్దియా. ఇప్పటికే తొమ్మిది ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా, ప్రజలు ఆనందంతో ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. శుభకార్యాలు లేని సందర్భంలోనూ ఇవి ప్రభుత్వ కార్యక్రమాలు , సమావేశాలు, రక్తదాన శిబిరాలు వంటి వాటికి వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా లాక్డౌన్ సమయంలో అనాథలకు పునరావాస కేంద్రాలుగా.. వినాయక నిమజ్జన సమయంలో బందోబస్తుకు వచ్చే పోలీసులకు తాత్కాలిక విడిదిగా.. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. కాగా, రూ. 65.60 కోట్లతో మరో 16 ప్రాంతాల్ల్లో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లను విడతల వారీగా వినియోగంలోకి తేనున్నారు.
27,500 చెల్లిస్తే చాలు..
ప్రస్తుతం నగరంలో తొమ్మిది ప్రభుత్వ మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. కేవలం రూ. 27,500లతో ఒకేసారి రెండు వేల మందితో వేడుక జరుపుకొనేలా వీటిని నిర్మించారు. ప్రైవేటు హాళ్లను తలదన్నేలా.. జూమర్ లైట్లు, అద్దం లాంటి ఫ్లోరింగ్, వంటగది, పెండ్లి వేడుకల కోసం వధూవరులను ముస్తాబు చేసేందుకు ప్రత్యేక గదులు..బంధుమిత్రులకు వసతి.. సురక్షిత నీరు ఒక్కటేమిటి.. సకల సదుపాయాలు కల్పించారు.
ఒక్కో ఫంక్షన్ హాల్లో..
అధికారుల లెక్కల ప్రకారం.. పెండ్లి సీజన్లో ఒక్కో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నెలకు 15 నుంచి 20 వేడుకలు జరుగుతున్నాయి. ఇతర సమయాల్లో మాత్రం నెలకు 4 నుంచి 5 ఫంక్షన్లు ఉంటున్నాయి.
సీతాఫల్మండి లో
సిటీబ్యూరో/బన్సీలాల్పేట, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో సామన్యులు పెండ్లి, ఇతర వేడుకలు చేయడమంటే సులువు కాదు.. ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇంటి వద్ద దావత్ చేద్దామంటే ఉన్న వీధులు ఇరుగ్గా ఉంటాయి. ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామంటే తక్కువలో తక్కువ రూ.60 నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వంట సామాగ్రి, డెకరేషన్, ఇతరత్రా కలిపి మరో రూ.50వేలు దాటుతుంది. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ హాళ్ల అద్దెలు భరించలేని మధ్య, దిగువ తరగతి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీని ఆదేశించారు. దీంతో రూ.90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్ను నిర్మించాలని భావించి ఈ మేరకు విడుతల వారీగా పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రూ.30.10కోట్లతో తొమ్మిది చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందుబాటులోకి వచ్చిన బహుళ వినియోగ ఫంక్షన్హాళ్లు వందలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ రూ.65.60కోట్ల అంచనాతో మరో 16 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లకు శ్రీకారం చుట్టగా, విడతల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
రూ.27వేలకే అంతా..!
లక్షలు పోస్తే తప్ప.. ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో లభించే సేవలు ప్రభుత్వం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లలో తక్కువ ఖర్చుతోనే లభిస్తున్నాయి. కేవలం రూ.27,500లతో ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సౌలభ్యంతో నిర్మించారు. కండ్లు మిరుమిట్లు గొలిపే జూమర్ లైట్లు, అద్దంలాంటి ఫ్లోరింగ్, సామాగ్రితో కూడిన వంటగది, పెండ్లి వేడుకల కోసం వధూవరులను ముస్తాబు చేసేందుకు ప్రత్యేక గదులు, బంధుమిత్రులకు విడిది వసతి, సురక్షిత తాగునీరు ఇలా సకల సౌకర్యాలతో ఈ ఫంక్షన్హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
చింతల్ డివిజన్ భగత్సింగ్నగర్లో…
“ఆల్ ఇన్ వన్” హాల్స్..!
పెండ్లిళ్ల సీజన్లో ఒక్కో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో నెలకు 15 నుంచి 20 ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఇతర సమయాలలో నెలకు 4 లేదా 5 వరకు ఫంక్షన్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వేడుకలు లేని సమయంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, వైద్య శిబిరాలు, కరోనా వ్యాక్సిన్ శిబిరాలు, ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు, రక్తదాన శిబిరాలకు వేదికగా నిలుస్తున్నాయి. ప్రధానంగా కరోనా లాక్ డౌన్ సమయంలో అనాథలకు పునరావాస కేంద్రంగా, వినాయక నిమజ్జన సందర్భంలో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు తాత్కాలిక విడిది కోసం ఇలా అనేక రకాలుగా ఈ హాలు ఉపయోగపడుతున్నది.
బన్సీలాల్పేటలో
ఈ ఫంక్షన్ హాళ్ల ప్రత్యేకతలు
గాజులరామారం భగత్సింగ్ నగర్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్
చెల్లించాల్సిన అద్దె వివరాలు:
జీహెచ్ఎంసీ నిర్మించిన ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు అద్దె కేవలం రూ.27,500 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా వ్యక్తులకు కాకుండా ‘జీహెచ్ఎంసీ, కమిషనర్’ పేరుతో జాతీయ బ్యాంకు నుంచి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని, స్థానిక జీహెచ్ఎంసీ సర్కిల్ రెంట్ కంట్రోల్ అధికారికి అందజేసి, రసీదు తీసుకోవాల్సి ఉంటుంది.
ఐదేండ్లలో వెయ్యికి పైగా శుభకార్యాలు
డివిజన్లో అత్యధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ప్రైవేట్ హాళ్లకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని, జీహెచ్ఎంసీ ద్వారా నగరంలో తొలిసారిగా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాలు నిర్మించారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ స్మారక మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు పేరుతో సకల సదుపాయాలతో నిర్మించిన దానిని 2017లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గడిచిన ఐదేండ్లలో ఇందులో వెయ్యికి పైగా వివాహాలు, ఇతర శుభకార్యాలు జరిగాయి. పేదలకు ఎంతో డబ్బు ఆదా అయ్యింది. – కార్పొరేటర్ కె.హేమలత
రూ.27,500 ప్యాకేజీలో సదుపాయాలు
1. ఆరు వందల మంది కూర్చునే విశాలమైన హాలు.
2. అన్ని విధాలుగా అనువైన కల్యాణ వేదిక
3. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె డ్రెస్సింగ్ రూమ్లు
4. కుర్చీలు, సోఫాలు ఉచితం
5. వంట సామాగ్రి ఉచితం
6. బోరు నీరు ఉచితం
7. వంట గది
8. విశాలమైన పార్కింగ్ సదుపాయం
9. శుభ్రం చేసేందుకు లేబర్
10. విద్యుత్ వాడకం చార్జీలు కలిపి ఉన్నాయి.
ఇతర ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో.. రూ.లక్ష ప్యాకేజీ సదుపాయాలు..!
1. హాలు
2. కుర్చీలు, సోఫాలు
3. వంట గది
4. పార్కింగ్ సదుపాయం (ఉన్నంతలోనే)
5. శుభ్రం చేసేందుకు లేబర్ చార్జీలు అదనం
6. వాడుకున్నంత విద్యుత్ చార్జీలు అదనం
7. సమయం దాటితే గంటకు అదనంగా రుసుము చెల్లించాలి.