పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ
పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, పలు సంఘాలు, ప్రజలు
మల్కాజిగిరి,జూన్2: బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాకరామవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఎమ్మెల్యే హన్మంతరావు ఆవిష్కరించి, కేక్కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు.
దళితుల అభివృద్ధికోసం దళితబంధు పథకంలో ఒక్కొక్కరికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ కార్యాలయాల్లో డీసీ రాజు, నాగమణి, నేరేడ్మెట్ చౌరస్తాలో కార్పొరేటర్ మీనాఉపేదర్ రెడ్డి, అల్వాల్లో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, వెంకటాపురంలో కార్పొరేటర్ సబితాకిశోర్, మల్కాజిగిరి జిల్లా పరిషత్ స్కూల్లో ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, మీనాఉపేందర్ రెడ్డి, సునీతరాము యాదవ్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, సర్కిల్ మహిళా అధ్యక్షురావు విజయకుమారి, సర్కిల్ అధ్యక్షుడు శ్రీనివాస్, మీడియా ఇన్చార్జి నిరంజన్, అనిల్కిశోర్, పరశరాంరెడ్డి, ఉపేందర్రెడ్డి, అంజయ్య, రాముయాదవ్, సంతోష్రాందాస్, రంపే చంద్రమౌళి, కవి, ఉషశ్రీ, శారద, వైశాలి తదితరులు పాల్గొన్నారు.