సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నివాళులర్పించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్ డీసీపీ అనసూయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాయింట్ సీపీ(అడ్మిన్) ఎం.రమేశ్ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు శ్రీదేవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.