ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
గ్రేటర్వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి..అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ ) : ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఎండీ దానకిశోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు, జలమండలి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ శర్మన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సూర్యలత, డిప్యూటీ కలెక్టర్ సంతోషిణి తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లిలోని టీజీవోస్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీజీవోస్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు రవీందర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ పాల్గొన్నారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ జానకీ షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రావుల గిరిధర్, అడ్మిన్ రాఘవరావు, వైవీఎస్. సుదీంద్ర తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులు తాడబోయిన శ్రీనివాస్ (డీజీఎం మారెటింగ్), పురుషోత్తమాచార్యులు (సీనియర్ అకౌంటెంట్), బి.ఆనంద్ (జూనియర్ ఇన్స్పెక్టర్), పి.సునీల్ (పీఏ టు చైర్మన్)లను సత్కరించారు. సింగరేణి భవన్ ఉద్యోగులకు, పొరుగు సేవల సిబ్బందికి వివిధ అంశాల్లో నిర్వహించిన క్రీడా, సాంసృతిక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడ్వయిజర్లు డీఎన్ ప్రసాద్ (మైనింగ్), సురేంద్రపాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె. అల్విన్, జీఎం (కో ఆర్డినేషన్) సూర్యనారాయణ, జీఎం (మారెటింగ్) ఎం.సురేశ్, సీఎంవోఏఐ జనరల్ సెక్రటరీ ఎన్.వి.రాజశేఖరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాసర్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని శాఖల కేంద్ర కార్యాలయాల్లో..
రాష్ట్ర హజ్ భవన్లో హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం జెండాను ఆవిష్కరించారు. బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, కే కిషోర్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. జలసౌధలో నిర్వహించిన వేడుకల్లో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్, హరిరామ్, నాగేందర్రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.