సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా…
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఆర్కేపురం, జూన్ 2 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమర వీరుల స్థూపానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్తో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిల్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రంగారెడ్డి జిల్లా డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నాయకులు ఇంటూరి అంకిరెడ్డి, మహేందర్యాదవ్, దర్పల్లి అశోక్, సిరిపురం రాజేశ్గౌడ్ తదితరులు ఉన్నారు.