కవాడిగూడ, ఫిబ్రవరి 26: తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కవాడిగూడ డివిజన్లోని బండమైసమ్మనగర్లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, ఈటల రాజేందర్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్ గౌడ్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు డీటీ మల్లయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుకు సుధాకర్, మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘం సమాఖ్య మాజీ చైర్మన్ ధర్మయ్య, మేడ్చల్ జడ్పీ వైస్ చైర్మన్ పూస వెంకటేశ్, అమర్, తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షుడు మంగలి పెల్లి శంకర్, గాలి సత్యనారాయణ, మెట్టు ధన్రాజ్, బీఆర్ లక్ష్మయ్య, మల్లేశ్ తదితరులు హాజరై మల్లయ్య పార్థీవ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లయ్య అంతిమయాత్ర బండమైసమ్మనగర్ నుంచి ప్రారంభమై బన్సీలాల్పేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.