హైదరాబాద్ : తెలంగాణ డ్రైవర్ల జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. అక్రమంగా తిరుగుతున్న ఇతర జిల్లాల ఆటోలను అడ్డుకోవడంలో పోలీసులు, ఆర్టీఏ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TADJAC) డిసెంబర్ 15న జంటనగరాల్లో ఆటోల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడుతూ.. ఓలా, ఉబర్ క్యాబ్ యాజమాన్యాలు తమ నియంత్రణలో ఉన్న నాన్ లోకల్ ఆటోలను జంట నగరాల్లో అక్రమంగా నడుపుతున్నాయని ఆరోపించారు. వాటిని సీజ్ చేయాలని చేయాలన్నారు.
ఈ సందర్భంగా ప్రతి డ్రైవర్కు రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ను కోరారు. చలాన్ల పేరుతో ఆటో డ్రైవర్ల నుంచి ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు బలవంతంగా పెనాల్టీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.