చిక్కడపల్లి, జూలై 15: యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం(టీఏడీఎఫ్) అధ్యక్షడు నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హైదరాబాద్లో యాప్ ఆధారిత కార్మికులు హాజరయ్యారు. యాప్ ఆధారిత కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జూలై 22న సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు.. సతీష్, ఆర్కే రెడ్డి, సలీం, సంతోష్త్, మంజూర్, నయీం, శివ, చిన్న, శ్రవణ్, మాజీద్, శ్రీధర్, మహేందర్, మణికంఠ తదితరలు పాల్గొన్నారు.