అమరావతి : రాబోయే 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ(TDP)- జనసేన(Janasena) ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నిలదొక్కుకునే వరకు టీడీపీతో పొత్తు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద యువగళం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2019లోనే వైసీపీ అధికారంలో వస్తే కొండను, కోనను దోచుకుంటారని చెప్పానని అంతకంటే ఎక్కువగా ప్రజలను ఆ పార్టీ దోచుకుందని విమర్శించారు.
చంద్రబాబు(Chandra Babu) ను జైల్లో పెట్టిన్నప్పుడు బాధ అనిపించిందని, ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎండగట్టేందుకు తాను ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానని వెల్లడించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరూ ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంటుందని, రాష్ట్రానికి పెట్టుబుడులు రావని జోస్యం చెప్పారు. తల్లి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి ఆడపడుచులకు ఏం గౌరవం ఇస్తారని ఒంటరి మహిళలు అన్యాయానికి గురవుతున్నారు.
ఏపీ భవిష్యత్తును నిర్దేశించే క్షణాలు వచ్చాయని అన్నారు. భవిష్యత్లో ఉమ్మడి మానిఫెస్టోను రూపొందించి ప్రకటిస్తామని వివరించారు. ఆరోగ్యకేంద్రాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన , సీపీఎస్ రద్దు విషయంలో చర్చ, ఉపాధ్యాయుల భర్తీ తదితర పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా పథకాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.