Crime News | సిటీబ్యూరో: కెమికల్స్తో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న వ్యాపారిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రష్మీపెరుమాళ్ కథనం ప్రకారం.. లాలాపేటకు చెందిన నీల వెంకటేశ్వర్లు టైటానియం డైయాక్సైడ్, గ్జాథమ్గమ్లను కలిపి.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ను తయారు చేసి, చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు లాలాగూడ పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి తయారీ కేంద్రంపై దాడి చేశారు. 1300 కిలోల నకిలీ అల్లం, వెల్లులి పేస్ట్, 20 కిలోల కెమికల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రసాయనాలు రంగుల కోటింగ్, పేపర్, ప్లాస్టిక్, రబ్బర్, పెయింట్స్లో ఉపయోగిస్తారు.