సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ అందాలను వీక్షించేందుకు వచ్చేవారి సౌలభ్యం కోసం ఈ ఆదివారం నుంచి (సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు) ట్యాంక్బండ్పై వాహనాలను అనుమతించమని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ట్యాంక్బండ్ సందర్శనకు అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్పార్కు వరకు ఇరువైపులా వాహనాలు నిలుపుకునేలా స్థలాలు కేటాయించినట్లు తెలిపారు. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను వేర్వేరుగా పార్కింగ్ చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్ రూట్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, పీవీమార్గ్, లోయర్ ట్యాంక్బండ్ రూట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ-1 చౌహాన్ సూచించారు.