హైదరాబాద్, అక్టోబర్14(నమస్తే తెలంగాణ) : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం రాజ్భవన్లో ఆయుధ పూజ నిర్వహించారు. దసరా పండుగ నేపథ్యం లో గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులు, రాజ్భవన్ సిబ్బందితో కలిసి రాజ్భవన్లో ఉన్న దేవాలయం సమీపంలో భద్రతా సిబ్బంది ఆయుధ పూజ, రాజ్భవన్ వాహనాలకు వాహనపూజ నిర్వహించారు. ఆ తర్వాత గవర్నర్ సుధర్మ బ్లాక్లో ఉన్న రాజ్భవన్ లైబ్రరీని సందర్శించి పుస్తక పూజ చేశారు. గవర్నర్ భర్త డాక్టర్ పి.సౌందర్రాజన్, గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. రాజ్భవన్లో గవర్నర్ జమ్మి మొక్కను నాటారు.