Telangana Assembly Elections | సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. మొదటి రౌండ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ 11658 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఐదో రౌండ్లో బీఆర్ఎస్కు 5211, బీజేపీకి 2935, కాంగ్రెస్కు 901 ఓట్లు పోలయ్యాయి. తలసాని లీడ్లో ఉండటంతో గులాబీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.