Talasani Srinivas Yadav | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకున్న అక్కసును బయటపెట్టాడని.. బీజేపీ, టీడీపీ కలిసి మరోసారి తెలంగాణ మీద దాడి చేస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వమని.. అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడినదానికి ఆంధ్రోళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇయ్యం. దానికి కావాలంటే చట్టం తెస్తా అన్నడు. నేనన్నా కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికినేను సిద్దంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది కూడా మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడీ కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఓటరు సవరణ (SIR)పై ప్రజలకు అవగాహన కల్పించాలి. SIR కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి… లేకుంటే అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందని తలసాని సూచించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తలసాని సవాల్
పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వము కావాలంటే చట్టం తెస్తాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నాడు
నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ
– మాజీ మంత్రి,… https://t.co/Zbqt2g0t7l pic.twitter.com/IpY4zX4Dja
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026