బేగంపేట్ ఏప్రిల్ 21 : ఈ నెల 27న నిర్వహించే బీఆర్ ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి బస్తీ, ప్రతి కాలనీ నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
స్వరాష్ట్ర సాధన తోనే న్యాయం జరుగుతుందని గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వం లో బీఆర్ఎస్ పుట్టిందన్నారు.రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ కేసీఆర్ శ్రీ రామరక్ష అన్నారు. పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో 27న అన్ని డివిజన్ లలో పార్టీ జెండాలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని సూచించారు.
బేగంపేట అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, నాయకులు నాగులు, కిశోర్, నరేందర్, అశోక్ యాదవ్, ఏసూరి మహేశ్, లక్ష్మీపతి, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, సురేశ్గౌడ్ పాల్గొన్నారు.