సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ ) : ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (ఎస్ఎన్డీపీ) కార్యక్రమంతో శాశ్వత పరిషారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్తో కలిసి జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శర్మన్, వాటర్ వర్స్ ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఎస్ఎస్డీపీ ఈఎన్సీ జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
బేగంపేట నాలాకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాశ్నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రజలు వరద ముంపునకు గురవుతున్నారని మంత్రి తలసాని అన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుంచి స్ట్రాం వాటర్ పైపులైన్, సీసీ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ముంపు సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని తెలిపారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ అధికారులు, వాటర్ వర్స్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇటీవల మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలోని అంశాలు
ముషీరాబాద్ మండల పరిధిలోని భోలక్పూర్లో సోమప్ప మఠానికి చెందిన 3,571 గజాల స్థలంలో సుమారు 130 నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ స్థలాన్ని బల్దియా స్వాధీనం చేసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించాలి.
జీరా కాంపౌండ్లోని దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో సుమారు 70కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారం చెల్లించాలి.
రాంగోపాల్ పేట డివిజన్లోని 134గృహాల వారు జీవో 816 కింద 1994లో రెగ్యులరైజేషన్లో భాగంగా దరఖాస్తు చేసుకున్నారన్న అంశంపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం సానుకూలత.
గోడేఖీ ఖబర్, జంగంమెట్, న్యూ బోయిగూడ, హైదర్బస్తీ తదితర 9ప్రాంతాల్లో 485మున్సిపల్ క్వార్టర్స్ ఉండగా.. వీటిలో గోడేఖీ కబర్, జంగంమెట్లో డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి.
మిగతా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ క్వార్టర్స్ను రెగ్యులరైజ్ చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం.
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని న్యూ బోయిగూడ, హైదర్ బస్తీ ప్రాంతాల్లోని క్వార్టర్స్ను జీవో 58, 59 కింద రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
మోండా మారెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్ శంకర్ స్ట్రీట్లో 7, సజన్లాల్ స్ట్రీట్లో 22 కుటుంబాలకు సంబంధించి ఇండ్ల క్రమబద్ధీకరణపై చర్యలు.
రాంగోపాల్ పేట డివిజన్లోని వెంగళరావునగర్, సనత్నగర్ డివిజన్లోని శ్యామల కుంటలో నివాసముంటున్న అనేక నిరుపేద కుటుంబాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ వసంతకు ఆదేశం.
ఆకర్షణీయంగా చారిత్రక కట్టడాలు
ఎంతో చరిత్ర కలిగిన మోండా మారెట్, ఓల్డ్ జైల్ ఖానా భవనాలను మోజంజాహీ మారెట్ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణను రూపొందించాలని చెప్పారు. మినిస్టర్ రోడ్లో ఎన్నో సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరిందని, అక్కడ నూతన గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను అకడి నుంచి తరలించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. సనత్నగర్లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో అండర్పాస్ నిర్మాణ పనులు, ఫతేనగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులను చేపట్టేందుకు రైల్వే, జీహెచ్ఎంసీ, అధికారులతో కలిసి పర్యటిస్తామని మంత్రి తెలిపారు.