మాదాపూర్ : హఫీజ్పేట్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు వి. పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో పాటు వైద్యాధికారులు డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ సృజనలతో కలిసి బుధవారం ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ … సమాచార సేకరణలో స్మార్ట్ ఫోన్లు ఆశా వర్కర్లకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఫీవర్ సర్వే, బీపి, షుగర్, ప్రెగ్నెన్సీ వంటి వివరాలను పొందుపరిచేందుకు ఉపయోగపడుతాయని అన్నారు. ఆశావర్కర్లు వైద్యులకు, ఉన్నతాధికారులకు అనుసంధాన కర్తలుగా పనిచేయాలని, స్మార్ట్ ఫోన్లను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు వాలా హరీష్ రావు, వెంకటేష్ గౌడ్, సదేష్ కుమార్, సబీర్, ఖాజాతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.