సికింద్రాబాద్, డిసెంబర్14: సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన తీగుళ్ల పద్మారావు గౌడ్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ పద్మారావు గౌడ్తో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సికింద్రాబాద్లో హ్యాట్రిక్ సాధించారు.
2004లో పద్మారావు గౌడ్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అప్పటి ఎన్నికల్లో ఆయనకు 3067 ఓట్ల మెజారిటీ వచ్చింది. అనంతరం, 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లో ఆయన మెజారిటీ పెరుగుతూ వచ్చింది. తాజాగా 45, 240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్లో హ్యాట్రిక్తో ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు.