Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన టీ హబ్ 2.0 అంకుర సంస్థలకు వరంలా మారింది. రూ.276 కోట్లతో 5.82 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో పది అంతస్తుల్లో నిర్మించిన ఈ టెక్నాలజీ ఇంక్యుబేటర్ సెంటర్ దేశంలోనే అతిపెద్దది.
ఇక్కడ దాదాపు రెండువేల కంపెనీలు కార్యకలాపాలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒక చోటకు చేర్చడం టీహబ్ ముఖ్య ఉద్దేశం.