పురాతన డ్రైనేజీ లైన్ల మార్పు
విద్యుత్ కేబుల్ వ్యవస్థ ప్రక్షాళన
ఆరుబయటే ఆస్పత్రి డైట్ కిచెన్
సెల్లార్లో కేవలం వాహనాల పార్కింగ్
రోగుల నుంచి డబ్బులు తీసుకున్నట్టు తెలిస్తే ఉపేక్షించేది లేదు..
వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్రెడ్డి
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 5: గాంధీ దవాఖానను పట్టి పీడిస్తున్న పలు సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని, అందుకు సంబంధించి సమూల ప్రక్షాళన చర్యలు చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్రెడ్డి తెలిపా రు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మం త్రి ఆదేశాల మేరకు, మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఆర్ఎంఓ డాక్టర్ జయకృష్ణ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ ఈ సురేందర్ రెడ్డి, డీఈఈ దుర్గాప్రసాద్లతో కలిసి రమేశ్ రెడ్డి దవాఖానలో పర్యటించారు. సెల్లార్లోని డైట్ క్యాంటీన్ ప్రాంతాన్ని, నిరుపయోగ వస్తువులు ఉన్న ప్ర దేశాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ప్రధానంగా నాలుగో తరగతి సిబ్బంది రోగుల వద్ద నుంచి డ బ్బులు వసూలు చేసినట్టు ఇకపై ఎలాంటి ఫిర్యాదు వ చ్చినా ఉపేక్షించేది లేదని, వారిని విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా అలాంటి వారిపై క్రిమినల్ కేసుల ను కూడా పెడతామని ఆయన వారిని హెచ్చరించారు. ఇక, సెల్లార్లో పేరుకుపోయిన నిరుపయోగ, వ్యర్థ సా మగ్రిని తొలగించి ఇక నుంచి దానిని సాంతం పార్కింగ్ కోసమే వినియోగిస్తామని తెలిపారు.
సెల్లార్లో ఉన్న వివిధ విభాగాలను తక్షణమే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రోగుల డైట్ మెనూలోనూ సమూల మార్పులను తీసుకొస్తూ వారికి నాణ్యతతో కూడిన పోషక ఆహా రం అందించనున్నట్టు తెలిపారు. గాంధీ దవాఖానలో పురాతన డ్రైనేజీ వ్యవస్థను మార్చడానికి కావలసిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని రమేశ్రెడ్డి అన్నారు. దవాఖాన భవనం నిర్మించి రెండు దశాబ్దాలు అవుతున్నదని, నాటి డ్రైనేజీ పైపులు శిథిలావస్థకు చేరి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఇందుకు సంబంధించి టీ ఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీర్ల బృందం సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించిందని తెలిపారు. సాంకేతిక ప్రక్రియ పూర్తి కావడానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి, ఈ లోగా తక్షణ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణకై సమగ్ర కేబుల్ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించామన్నారు.
నూతన సానిటేషన్ పాలసీలో..
నూతన సానిటేషన్ పాలసీ రూపొందించామని, దాని వలన పారిశుద్ధ్య పనుల నిర్వహణ మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అం దులో భాగంగా నిధుల కేటాయింపు గతంలో ఒక బెడ్ కు రూ.5,016 ఉండగా, ప్రస్తుతం, ఇకపై ఒక బెడ్కు రూ.7,500గా ఉండబోతుందని అన్నారు. దాని ప్రకా రం, గాంధీ దవాఖానలో 2019 గణాంకాల ప్రకారం, 1518 బెడ్లకు ప్రతి నెల రూ.1.14 కోట్ల నిధులను ఖర్చు చేయబోతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కూడా పెరుగుతాయని, వారి పనితీరులో కూడా మార్పులు రావాలని ఆశిస్తున్నామని అన్నారు.
డైట్ మెనూలో నాణ్యమైన పోషకాహారం..
రోగులకు ఇచ్చే డైట్ భోజనం వ్యయాన్ని సర్కారు పెంచిందని, ఇకపై ఇచ్చే ఆహార నాణ్యత, పరిణామం మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. ఇందుకు ఉస్మానియా, గాంధీ దవాఖానాల సూపరింటెండెం ట్లు, ఇద్దరు డైటీషియన్లతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని, వారి సూచనల మేరకు కొత్త మెనూ రూపొందిస్తున్నామని తెలిపారు. రోగులందరికి అధిక పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తామని, కచ్ఛితంగా కోడిగుడ్డు ఉదయం, మధ్యాహ్నం మెనూలో ఉండాలని డైట్ క్యాంటీన్ నిర్వాహకులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు రక్తహీనత కారణంగా బలహీనంగా ఉండేవారికి, తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు జన్మనిచ్చిన తల్లులకు, మధుమేహ, కిడ్నీ రోగులకు వేర్వేరు గా అధిక పోషక విలువలు గల ఆహారం అందించే మెనూ ఉండేలా జాగ్రతలు చేపడుతున్నామని అన్నా రు. ప్రస్తుతం సెల్లార్లో ఉన్న డైట్ కిచెన్లో ఆధునిక యంత్రాల ద్వారా భోజనం తయారు చేయనున్నట్టు తెలిపారు.
గాంధీలో స్వల్ప అగ్ని ప్రమాదం
బన్సీలాల్పేట్, ఏప్రిల్ 5: గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం మూడో అంతస్తులోని మైక్రో బయాలజీ విభాగంలో ఉన్న స్విచ్ బోర్డులో నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మెయిన్ స్విచ్ను ఆపి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఘటనా ప్రదేశాన్ని డీఎంఈ డాక్టర్ కే.రమేశ్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు లు సందర్శించారు. గతంలో కూడా పలుమార్లు వివిధ వార్డులలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయని, అలాం టి వాటిని నివారించడానికి విద్యుత్ కేబుల్ వ్యవస్థను మార్చడానికి చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దవాఖానలో అగ్ని ప్రమాద నివారణకై రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని అన్నారు.