దేశ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ హైదరాబాద్ కేంద్రంగా దమ్ బిర్యానీ ఆర్డర్ల వివరాలను వెల్లడించింది. దేశంలో అమ్ముడైన ప్రతి ఐదు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాదీలు లాగించేస్తున్నారని తేలింది. గడిచిన 180 రోజుల వ్యవధిలో ఏకంగా 72 లక్షల బిర్యానీల ఆర్డర్లు జరిగాయి. అత్యధికంగా 9 లక్షల మంది నిత్యం దమ్ బిర్యానీ, 7.9 లక్షల మంది బిర్యానీ రైస్, 5.2లక్షల మంది మినీ బిర్యానీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేశారు.
ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 15 వరకు జరిగిన ఆర్డర్లను విశ్లేషించిన స్విగ్గీ.. తాజా నివేదికను వెల్లడించింది.
-సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ)