సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ): ‘స్వేచ్ఛా సే యోగాహార్, జల్ సే జీవన్’ పేరుతో 730వ యోగాహార్ దినోత్సవాన్ని పద్మశ్రీ ఉమాశంకర్ పాండే ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల నుంచి 80 మంది యోగాహార్ సభ్యులు, ఢిల్లీకి చెందిన డాక్టర్ షీలా యాదవ్, డాక్టర్ రాజేశ్ యాదవ్ యోగాసనాల్లో పాల్గొన్నారు. ‘ఖేత్ పే మెడ్, మెడ్ పర్ పేడ్’ ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 19 రాష్ర్టాలతోపాటు పలు దేశాల్లో కూడా పలు అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మున్నీలాల్ యాదవ్తోపాటు 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.