మెహిదీపట్నం, జనవరి 21 : చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచి సెవన్ టూంబ్స్ వరకు స్కై కేబుల్ ఏర్పాటుకు హెచ్ఎండీఏ అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. అంతకు ముందు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ హెచ్ఎండీఏ ప్రాజెక్ట్ అధికారులతో దారుస్సలాంలో సమావేశం నిర్వహించారు. స్కై కేబుల్ ఏర్పాటుకు రూట్ పరిశీలన, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. అనంతరం అధికారులు గోల్కొండ కోటకు వెళ్లి సర్వే నిర్వహించారు. టోలిచౌకి ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్ హరూన్ ఫర్హాన్, ఎంఐఎం నాయకులు అధికారులతో పాటు సర్వేలో పాల్గొన్నారు.
గ్రంథాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన
అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తున్నామని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. మల్లేపల్లి డివిజన్ సీతారాంబాగ్ డీ – క్లాస్లో ఉన్న లైబ్రరీ గ్రౌండ్లో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న గ్రంథాలయం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి జాఫర్ఖాన్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.