హైదరాబాద్ : విహార యాత్ర కోసం ఏపీలోని విశాఖపట్నం వెళ్లి అక్కడి ఆర్కే బీచ్లో మరణించిన రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకుల కుటుంబాలను మంత్రి తలసాని పరామర్శించారు.
అనంతరం ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మూడు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించేలా కృషి చేస్తామని మంత్రి హామీనిచ్చారు.