సిటీబ్యూరో: సరికొత్త ఆటవిడుపులతో ట్యాంక్బండ్పై ఈ ఆదివారం సన్డే ఫన్డే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ ట్విట్టర్లో ప్రకటించారు.
19వ తేదీ సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ వేదికగా నగర వాసులు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాగర్ నీటిలోని మ్యూజికల్ ఫౌంటెయిన్ రాత్రి 7,8,9,10 గంటల సమయంలో ప్రతి గంటకోసారి 15 నిమిషాల పాటు 5-6 ట్యూన్లతో అలరిస్తుందన్నారు.