సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ) : హుస్సేన్సాగర్ అందాలను ఆస్వాదించడంతోపాటు కుటుంబసమేతంగా హాయిగా ట్యాంక్బండ్పై గడిపేలా నిర్వహించే ‘సండే-ఫన్డే’ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. కరోనా కారణంగా కొన్నాళ్లుగా నిలిచిపోయిన వినోద కార్యక్రమాన్ని ఈ ఆదివారం నిర్వహిస్తుండడంతో పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై రాకపోకలు నిలిపివేసి కేవలం సందర్శకులను అనుమతిస్తారు. సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు, ఇతర వినోద కార్యక్రమాలు ఉత్తేజపర్చనున్నాయి.