రవీంద్రభారతి, ఆగస్టు 6: మన సంప్రదాయాలను నేటి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. దీపాంజలి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్నీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్య నృత్యంశాలతో నర్తకి సుముఖారెడ్డి అరంగేట్రం చేశారు. ఆదివారం రవీంద్రభారతిలోని ప్రధాన కళావేదికపై నాట్యగురువు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి ఆధ్వర్యంలో తన కూచిపూడి నృత్య ప్రదర్శనతో అందరిని మెప్పించారు. దీపాంజలి నృత్య అకాడమీలో వందిలాది విద్యార్థులకు కూచిపూడిలో శిక్షణను ఇచ్చి గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దారు.
కుమారి సుముఖారెడ్డి హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో12వ తరగతి పూర్తి చేసి సింగపూర్లో బిజినెస్ ఫైన్సాస్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. చిన్నతనం నుంచే కూచిపూడి రంగంపై మక్కువతో దీపికారెడ్డి వద్ద శిక్షణ పొందుతూ తొలి ప్రదర్శనలోనే ఆకట్టుకున్నారు. మొదట మహాగణపతిని స్తుతిస్తూ నాట్య ప్రదర్శనను ప్రారంభించారు. అంతకుముందు సినీ డైరెక్టర్ ఎస్వీ.కృష్ణారెడ్డి, సింగర్ సునీత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వెంకట్రామ్రెడ్డి, పలువురు నృత్య గురువులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.