సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించి, ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంక్లో ప్యూచర్సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్బాబు గురువారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్ గ్రౌండ్లో ఉద్యోగ విరమణ మహోత్సవం నిర్వహించగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంంగా సుధీర్బాబు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని సిబ్బంది కఠోర శ్రమతోనే గతంలో ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్, నేడు ప్యూచర్సిటీగా అవతరించిన కొత్త కమిషనరేట్లు రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచాయన్నారు. కాగా 2001వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిగా సుధీర్బాబు తన ప్రస్తానంలో మహిళల భద్రత, సైబర్క్రైమ్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వాహణలో కీలక మార్పులు తీసుకొచ్చారు.
2012లో ఇండియన్ పోలీస్ మెడల్, 2025లో అతి ఉత్కృష్ట సేవా పతకం ఆయనకు లభించాయి. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికీ సహజమని, అయితే ప్రజలకు అందించే సేవలే చిరస్తాయిగా నిలుస్తాయని సుధీర్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ చందనాదీప్తి, బెటాలియన్ కమాండెంట్ జమీల్ భాషా, కమిషనరేట్ డీసీపీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.