రవీంద్రభారతి, ఫిబ్రవరి 9 : ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుద్దాల అశోక్తేజ గొప్ప జాతీయ కవి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడు డాక్టర్ కేవీ రమణాచారి 71వ జన్మదినం సందర్భంగా వంశీ ఆర్ట్స్ థియేటర్స్, శుభోదయ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రధాన వేదికపై ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి హాజరై సుద్దాల అశోక్ తేజ దంపతులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీ రమణాచారి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగేడు కిషన్రావు, ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డా.బొల్లినేని కృష్ణయ్య, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీరామరాజు, అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సంకరపల్లి శైలజ, కన్వీనర్ ప్రసన్నలక్ష్మి, సంయుక్త కార్యదర్శి సుజారమణ పాల్గొన్నారు. అంతకుముందు భూదేవి, రమణ శీలం, నందూరి లక్ష్మణ్, విఠల్దాస్, సూర్యసాయి, సింధూర, కీర్తన ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.